దోహా: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. డైమండ్ లీగ్లో అదరగొట్టాడు. శుక్రవారం జరిగిన పోటీలో నీరజ్.. జావెలిన్ను 88.67 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్లో నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే ఈ దూరాన్ని అందుకున్న నీరజ్.. తర్వాతి ప్రయత్నాల్లో వరుసగా 86.04మీ, 85.47 మీటర్లను మాత్రమే నమోదు చేశాడు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ కాగా, ఐదు, ఆరు ప్రయత్నాల్లో ఈటెను వరుసగా 84.37 మీటర్లు, 86.52 మీటర్ల దూరం విసిరాడు.
చెక్ ప్లేయర్ జాకుబ్ వడ్లేజ్ 88.63 మీటర్లతో రెండో ప్లేస్ను సాధించగా, పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా) 85.88 మీటర్ల దూరంతో థర్డ్ ప్లేస్లో నిలిచాడు. గతేడాది దోహా మీట్లో ఈ ఇద్దరూ 90 మీటర్ల మార్క్ను అందుకున్నా.. ఈసారి మాత్రం నిరాశపర్చారు. ఇక ఇండియా ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ 10వ ప్లేస్తో సరిపెట్టుకున్నాడు. మూడు ప్రయత్నాల్లో పాల్ 15.84 మీటర్ల దూరమే దూకాడు.