
జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా(43) చనిపోయారు. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ చికిత్స కోసం 2023 సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులతో పాటు ఆమె శరీరంలోని ప్రధాన భాగాలకు క్యాన్సర్ కణాలు వ్యాపించాయి. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఇన్ని రోజులు ఆమెను జాగ్రత్తగా చూసుకున్న వైద్య బృందానికి ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు వెలువడింది.
1980లో జన్మించిన జొలేకా మండేలా చివరి శ్వాసవరకు రచయితగా, ఉదమ్యకారిణిగా పనిచేశారు. ఆమెకు భర్తతో పాటుగా నలుగురు పిల్లలున్నారు. ఆమెకు 32 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ సోకడంతో చికిత్స చేయించుకున్నారు. మళ్లీ అది 2016లో తిరగబెట్టింది. తనకు క్యాన్సర్ సోకడంతో దానికి సంబంధించిన చికిత్స, తన చిన్నతనంలో లైంగిక వైధింపులు, డ్రగ్స్కు అలవాటు తదితర అంశాలపై ఇటీవలే డాక్యుమెంట్లో పేర్కొన్నారు. జొలేకా మండేలా మృతి పట్ల నెల్సన్ మండేలా ఫౌండేషన్ సంతాపం తెలిపింది