మల్కాజిగిరి,వెలుగు: నేరేడ్మెట్ క్రాస్ రోడ్ వద్ద రూ.3.5 కోట్లతో నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సిటీలో మెయిన్ జంక్షన్ల వద్ద 22 ఎఫ్ వోబీలను(ఫుట్ ఓవర్ బ్రిడ్జి) కడుతున్నామన్నారు. వీటిలో 5 బ్రిడ్జిలు పూర్తయ్యాయని తెలిపారు. భవిష్యత్లో హైదరాబాద్ రూపురేఖలను మార్చి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి, కార్పొరేటర్లు మీనా, ప్రేమ్ కుమార్, సునీత, జితేంద్రనాథ్, సబిత, నాయకులు పాల్గొన్నారు.