నేరేడ్​మెట్​లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రారంభం

నేరేడ్​మెట్​లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రారంభం

మల్కాజిగిరి,వెలుగు: నేరేడ్​మెట్ క్రాస్​ రోడ్​ వద్ద రూ.3.5 కోట్లతో నిర్మించిన ఫుట్​ఓవర్​ బ్రిడ్జిని గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..  సిటీలో మెయిన్ జంక్షన్ల వద్ద 22 ఎఫ్ వోబీలను(ఫుట్ ఓవర్ బ్రిడ్జి) కడుతున్నామన్నారు. వీటిలో 5 బ్రిడ్జిలు పూర్తయ్యాయని తెలిపారు. భవిష్యత్​లో హైదరాబాద్​  రూపురేఖలను మార్చి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో  నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్​ శ్రీలతా శోభన్​రెడ్డి, కార్పొరేటర్లు మీనా, ప్రేమ్ కుమార్, సునీత, జితేంద్రనాథ్, సబిత, నాయకులు పాల్గొన్నారు.