నేతాజీ ఆర్మీ బ్రిటీషోళ్లను వణికించింది: వెంకయ్య

నేతాజీ ఆర్మీ బ్రిటీషోళ్లను వణికించింది: వెంకయ్య

న్యూఢిల్లీ, వెలుగు: నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) బ్రిటీష్ పాలకులకు వణుకు పుట్టించిందని, స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్– ఐఎన్ఏ” ట్రస్ట్ మెంబర్ డాక్టర్ కల్యాణ్ కుమార్ దే రచించిన “నేతాజీ–ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ బ్రిటీష్ ఆర్కైవ్స్” బుక్ ను ఆయన బుధవారం ఆవిష్కరించారు. నేతాజీ స్వాతంత్ర పోరాటంలో యువతలో స్ఫూర్తి నింపారని వెంకయ్య కొనియాడారు. నవ భారత నిర్మాణంలో యూత్ కీలక పాత్ర పోషించాలన్నారు.