మహేశ్ బాబును పాన్ మసాలా భరిస్తుందా ?

మహేశ్ బాబును పాన్ మసాలా భరిస్తుందా ?
  • మహేశ్ బాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
  • తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న  నెటిజన్లు
  • బాలీవుడ్ భరించలేదు.. కానీ పాన్ మసాలా భరిస్తుందా అంటూ కామెంట్లు

సూపర్ స్టార్ మహేష్ బాబుపై నెటిజన్లు ముప్పేట దాడికి పూనుకున్నాయి. మేజర్ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా బాలీవుడ్ ఎంట్రీపై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పొగాకు ఉత్పత్తుల కోసం వ్యాపార ప్రకటనల్లో నటించడంపై పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలేంటీ? మహేష్ బాబును టార్గెట్ చేయడానికి గల కారణాలేంటీ అనే వివరాల్లోకి వెళితే..

"బాలీవుడ్‌కు భరించే శక్తి లేదు..  తెలుగు సినిమాకే పరిమితం అవుతాను. బాలీవుడ్‌లో నటించను. హిందీ చిత్ర పరిశ్రమకు నన్ను భరించేంత శక్తి లేదు. నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అందుకే నేను బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నా"నంటూ మహేష్ బాబు చేసిన మేజర్ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతా తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి.

మహేశ్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో  "నిన్ను బాలీవుడ్ భరించలేదు. కానీ పాన్ మసాలా భరిస్తుంది" అంటూ మహేశ్ నటించిన యాడ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి పలువురు  ట్రోల్స్ చేశారు. మహేష్ బాబును ఉద్దేశించి ట్వీట్లు చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక మహేష్ ద్వంద ప్రమాణాలు చేస్తున్నారని, టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాకు తెలిసి మహేష్ బాబు ఒక్కడే పాన్ మసాల ప్రోడక్ట్స్‌లో నటిస్తారమో. మిగితా నటీనటులు ఇలాంటి పొగాకు ఉత్పత్తుల్లో నటించడానికి దూరంగా ఉంటారు. మహేష్ బాబు ద్వంద ప్రమాణాలు చాలా బాగున్నాయి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

అంతే కాదు బాలీవుడ్ అంటే మహేశ్ కు అంత చులకనా? అంటూ ఓ వక్క జాతీయ మీడియా పలు రకాల కథనాలను ప్రసారం చేయగా, మరికొందరు సినీ అభిమానులు మహేశ్ బాబుపై ఫైర్ అవుతున్నారు. హిందీ పరిశ్రమ, భాషా చిత్రాలు అంటే గౌరవం లేదా అనే విధంగా భారీ కామెంట్లతో మహేష్‌ను టార్గెట్ చేశాయి. ఈ వివాదం ఇక్కడితోనే ఆగుతుందా.. లేదంటే ఇంకా ముదురుతుందా .. అనేది ఎవరికీ అంతచిక్కని ప్రశ్నగా మారింది.