సునీల్ గవాస్కర్‌కు ఘోర అవమానం.. ప్రముఖుల ఆగ్రహం

సునీల్ గవాస్కర్‌కు ఘోర అవమానం.. ప్రముఖుల ఆగ్రహం

భారత మాజీ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్‌కు ఘోర అవమానం జరిగింది. కొందరు ఆకతాయిలు చేసిన పనికి దేశం తలదించుకోవాల్సిన పరిస్థితి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య, క్రికెట్ వ్యాఖ్యాత మయంతి లాంగర్ ధరించాల్సిన ప్యాంటు సునీల్ గవాస్కర్‌ ధరించాడని కొందరు నెటిజనులు హేళన చేశారు. పనిలో పనిగా ఆ ప్యాంటును గవాస్కర్‌ నుంచి తొలగిస్తూ.. మయంతి లాంగర్ వేసుకున్నట్లు ఎడిట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది సరదాకు చేసిన చేసిన పనే అయినా.. ఒక దిగ్గజ క్రికెటర్‌ని ఇలా హేళన చేయడం ప్రముఖులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ  విషయంపై కొందరు క్రీడా ప్రముఖులు సీరియస్ అయ్యారు. ఒక పని చేసేటపుడు.. దాని వల్ల సమాజానికి ఏదైనా ఉందా అని ఆలోచించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ గవాస్కర్‌ వరల్డ్ కప్ మ్యాచ్ లకు కామెంటేటర్ గా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే.