ఏపీ రాజ్‌భవన్‌ చేరుకున్న గవర్నర్‌ నజీర్‌ దంపతులు

ఏపీ రాజ్‌భవన్‌ చేరుకున్న గవర్నర్‌ నజీర్‌ దంపతులు

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌ కు నూతన గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌ దంపతులు చేరుకున్నారు. ఈ నెల 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అంతకుముందు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. 

అంతకుముందు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా వీడ్కోలు పలికారు. గన్నవరం విమానాశ్రయంలో విశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎంతో సహా సీఎస్ జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. మూడున్నర సంవత్సరాల పాటు ఏపీ గవర్నర్ గా పని చేసేందుకు తనకు సహకరించిన వారందరికీ బిశ్వభూషణ్ కృతజ్ఞతలు తెలిపారు.