రెమ్యునరేషన్ భారీగా పెంచిన కొత్త భామలు

రెమ్యునరేషన్ భారీగా పెంచిన కొత్త భామలు

హీరోయిన్ల సినీ కెరీర్ తక్కువగా ఉంటుంది. సినిమాలు తగ్గుతున్న టైమ్ లో కొందరు కథానాయికలు పెళ్లి చేసుకున్నారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త భామలు మొదటి హిట్ పడగానే రెమ్యునరేషన్ అమాంతం పెంచేశారు. ఈ జాబితాలో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి, పెళ్లి సందడి భామ శ్రీలీల, సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఉన్నారు.

'ఉప్పెన' మూవీతో హిట్ అందుకున్న కృతీ శెట్టికి డిమాండ్ బాగా పెరిగింది. దాంతో రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. ఈ క్యూట్ గర్ల్ ఉప్పెన తర్వాత చేసిన సినిమాలు కూడా విజయం సాధించాయి. ఇక శ్రీలీల 'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీలీల అందానికి ఆడియన్స్ తో పాటు ఫిల్మ్ మేకర్స్ కూడా ఫిదా అయ్యారు. అందుకే రెమ్యునరేషన్ పెంచినా..కాదనకుండా హీరోయిన్ గా నిర్మాతలు అవకాశం ఇస్తున్నారు. ఈ అమ్మడు కూడా తన అందానికి తగ్గ పారితోషకమే తీసుకుంటుందట.

'సీతా రామం' మూవీతో మృణాల్ ఠాకూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. 2014లో విడుదలైన 'విట్టి దండు' అనే మరాఠి చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో ఆఫర్లను దక్కించుకున్న మృణాల్.. 'సీతారామం'తో టాలీవుడ్ ఆడియన్స్ మసుసు దోచుకుంది. ఇక సీతా రామం మూవీ నిర్మించిన మేకర్స్ ఈమెతో లేడీ సెంట్రిక్ సినిమా తెరకెక్కించబోతున్నారట. ఈ మూవీని నందిని రెడ్డి డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ పేరు వినిపిస్తోంది. సీతా రామం విజయంతో ఈ అందమైన భామ కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని సినీ వర్గాల టాక్.