అనిల్​ అంబానీకి కొత్త చిక్కులు

అనిల్​ అంబానీకి కొత్త చిక్కులు

ముంబై: దివాలా తీసిన అనిల్​ అంబానీకి ఆదాయపు పన్ను డిపార్ట్​మెంట్​నుంచి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. విదేశాలలో రూ. 800 కోట్ల పెట్టుబడి ట్రాన్సాక్షన్ల వివరాలు ఇవ్వడంలో ఆయన విఫలమవడంతో బ్లాక్​ మనీ యాక్ట్​ (బీఎంఏ) కింద ఆదాయపు పన్ను శాఖ ఒక ఆర్డరు జారీ చేసింది. బహమాస్​, బ్రిటిష్​ వర్జిన్​ ఐలాండ్​లలో పెట్టిన కంపెనీల బెనిఫిషియల్​ ఓనర్​షిప్​ ఎవరిదని ఐటీ డిపార్ట్​మెంట్​ ప్రశ్నించింది. బహమాస్​లో  2006లో  డైమండ్​ ట్రస్ట్​ను అనిల్​ అంబానీ ఏర్పాటు చేశారు. దీనిని డ్రీమ్​ వర్క్​ హోల్డింగ్స్​ ఇంక్​ లింకుతో నెలకొల్పారు. ఈ కంపెనీకి స్విస్​ బ్యాంకు అకౌంటు (యూబీఎస్​కి చెందిన జురిస్​ బ్రాంచ్​)తో లింకు ఉందని తేలింది. ఇక బ్రిటిష్​ వర్జిన్​ ఐలాండ్​లో 2010లో మరో ఆఫ్​షోర్​ కంపెనీ నార్త్​ అట్లాంటిక్​ ట్రేడింగ్​ అన్​లిమిటెడ్​ పేరుతోనూ ఆయన తెరిచారు. బ్యాంక్​ ఆఫ్​ సైప్రస్​లో ఈ కంపెనీకి అకౌంటు ఉన్నట్లు సమాచారం. ఇటీవల వెలుగులోకి వచ్చిన పండోరా పేపర్స్​ ప్రకారం ఈ బ్రిటిష్​ వర్జిన్​ ఐలాండ్​ కంపెనీతో అనిల్​ అంబానీ నాయకత్వంలోని 18 సంస్థలకు లింకులున్నాయి. విదేశీ కంపెనీకి అప్పులు కట్టలేకపోయిన అనిల్​ అంబానీ యూకేలోని ఒక కోర్టులో తాను దివాలా తీసినట్లు ప్రకటించుకున్నారు. ​లీగల్​ ఖర్చుల కోసం ఆభరణాలను సైతం అమ్ముకున్నానని అనిల్​ అంబానీ కోర్టుకు చెప్పారు.