
IPL ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆస్ట్రేలియాలో భారత పర్యటనపై పడింది. భారత్ ఆసీస్ గడ్డపై 3 వన్డేలు, 3 T20 మ్యాచ్ లు, 4 టెస్టులు ఆడనుంది. నవంబరు 27 నుంచి పర్యటన షురూ కానుంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కొత్త జెర్సీల్లో కనువిందు చేయనుంది. ఇప్పటి వరకు లైట్ బ్లూ కలర్ లో దర్శనమిచ్చిన టీమిండియా ఇకపై డార్క్ బ్లూ కలర్ యూనిఫాంలో కనిపించనుంది. 90వ దశకంలో భారత ఆటగాళ్లు ఇలాంటి ముదురు రంగు జెర్సీలనే ధరించేవారు.
లేటెస్టుగా BCCIతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న MPL స్పోర్ట్స్ సంస్థ అప్పటి డిజైన్ తో భారత జాతీయ జట్టు క్రికెటర్ల కోసం కొత్త జెర్సీలు రూపొందించింది. అంతేకాదు.. మ్యాచ్ విరామాల్లో ధరించేందుకు అనువైన దుస్తులతో పాటు ప్రస్తుతం కరోనా క్రమంలో ప్రయాణాల్లో మరింత ఆరోగ్య రక్షణ నిచ్చే వినూత్నమైన డ్రెస్సులను కూడా టీమిండియా ఆటగాళ్లకు అందించింది.