
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర కేబినెట్లో కొత్తగా చేరిన మంత్రులకు సెక్రటేరియెట్లో చాంబర్లు కేటాయించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉత్తర్వులు జారీ చేసింది.మైనింగ్ , కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామికి సెక్రటేరియెట్ రెండో అంతస్తులో 20, 21, 22 నంబర్ గదులను కేటాయించారు.
ఎస్సీ, ఎస్టీ శాఖ సంక్షేమ శాఖ మంత్రిఅడ్లూరి లక్ష్మణ్కు మొదటి అంతస్తులో 13, 14, 15, 16 నంబర్ గదులు అలాట్ చేశారు. పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి రెండో అంతస్తులోనే 26, 27, 28 నంబర్ గదులుకేటాయించారు. కొత్త మంత్రులు త్వరలోనే తమకు కేటాయించిన చాంబర్లలో బాధ్యతలు స్వీకరించనున్నారు.