ఆర్మీకి కొత్త మెషిన్ గన్స్

ఆర్మీకి కొత్త మెషిన్ గన్స్

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ అతి త్వరలో 16,400 కొత్త లైట్ మెషిన్ గన్స్(ఎల్ఎంజీ)ను కొననుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ కింద ఆర్మీ రిలీజ్ చేసిన ప్రకటనకు, బల్గేరియాకి చెందిన ఆర్సనల్, ఇజ్రాయెల్ కి చెందిన ఐడబ్ల్యూఐ, సౌత్ కొరియాకు చెందిన ఎస్ అండ్ టీ మోటివ్స్ బిడ్లు వేశాయి. వాటి వెపన్స్ ను ఆర్మీ టీమ్ పరిశీలిస్తోంది. అటుపైన మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో గన్స్ తయారీ కోసం ఎంపికైన కంపెనీతో ట్రయల్స్ జరుగుతాయి. ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం ఐఎన్ఎస్ఏఎస్ అనే ఎంఎంజీను వాడుతోంది. దీని స్థానంలో 7.62X51 ఎంఎం రేంజ్ కలిగిన గన్ ను తీసుకురావాలని భావిస్తున్నారు.