నయా నిజాం కేసీఆర్ వంగి నమస్కారాలు పెడుతున్నాడు

నయా నిజాం కేసీఆర్ వంగి నమస్కారాలు పెడుతున్నాడు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 

మెదక్: నయా నిజాం కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేంద్రం పైసలతో పథకాలు తెచ్చి పబ్లిసిటీ చేసుకుంటూ పొద్దుపుచ్చిన కేసీఆర్ ఇప్పుడు హడావుడి చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. సోమవారం బండి సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుని వడివడిగా ముందుకు సాగుతోంది. 
ఈ సందర్భంగా పాదయాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పాదయాత్ర లో భాగంగా వలస, సంచార జాతులను కలిసినా, చాలా చిన్న గుడిసెల్లో ఇబ్బందులు పడుతూ బతుకుతున్నారు, వారికి డబుల్ బెడ్రూం ఇచ్చి ఉంటే వారికి ఇబ్బందులు తప్పేవన్నారు. చెరుకు రైతులను కలిసినా, చెరకు ఫ్యాక్టరీలు మూతపడి పంట పక్క రాష్ట్రానికి పోయి అమ్ముకుంటున్నరు. రైతులు కష్టాలు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. 
కేసీఆర్ పొలంలో కొటి రుపాయల పంట పండుతది, ఇక్కడ రైతులు మాత్రం బికారి లుగా మారుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

కేవలం కేసీఆర్ కుటుంబం కోసం కాదు తెలంగాణ వచ్చిందా..? అని ఆయన ప్రశ్నించారు. సింగురు నీరు సదాశివపేట కు ఎందుకు రాదు అని నిలదీశారు. నిమ్జ్ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు ఉన్నా భూ సేకరణ లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూ బాధితులకు సరైన పరిహారం ఇవ్వకపోవడంతో ఆలస్యం అవుతుందన్నారు.  భూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కరోనా వాక్సిన్ పై ప్రచారం చేయడు, ఎందుకంటే అది మోడి ఫ్రీ గా ఇస్తుండు కాబట్టి అని ఆయన ఆరోపించారు. నిజాం అప్పుడు వంగి వంగి నమస్కారము పెట్టినట్టు ఇప్పుడు నయా నిజాం కెసిఆర్ వంగి వంగి నమస్కారాలు పెడ్తున్నడు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.