
- ప్రస్తుతం ఉన్నదానికి సమాంతరంగా నిర్మాణం
- గండిపేట కాండ్యూట్ లీకేజీలతో వృథాగా పోతున్న నీళ్లు
- రిపేర్లతో పాటు కొత్త పైప్లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు
- డీపీఆర్ రెడీ చేసిన వాటర్బోర్డు త్వరలోనే టెండర్లకు ఆహ్వానం
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్హైదరాబాద్ కు పెరుగుతున్న తాగునీటి అవసరాలకు అనుగుణంగా ఉస్మాన్సాగర్ నుంచి మరింత ఎక్కువ నీటిని డ్రా చేసుకునేందుకు అధికారులు ప్లాన్లు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా మరో కొత్త పైపు లైన్నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం ఉస్మాన్సాగర్నీటిని కాండ్యూట్ద్వారా ఆసిఫ్నగర్ ఫిల్టర్బెడ్స్కు తరలించి శుద్ధి చేస్తున్నారు. కొత్తగా తయారు చేసిన ప్లాన్లో ఈ కాండ్యూట్కు సమాంతరంగా మరో కొత్తపైప్లైన్ నిర్మించాలని వాటర్బోర్డు నిర్ణయించింది. ఈ పైప్లైన్పూర్తయితే ఉస్మాన్సాగర్కాండ్యూట్తో పాటు పైప్లైన్ద్వారా ఎక్కువ నీటిని డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది.
నిజాం హయాంలో నిర్మాణం
ఉస్మాన్సాగర్ కాండ్యూట్ నిజాం హయాంలో నిర్మించారు. పూర్తిగా గ్రావిటీ ద్వారా ఈ నీరు నేరుగా 14 కి.మీ. నుంచి ఆసిఫ్నగర్ ఫిల్టర్బెడ్కు చేరుతుంది. ఇప్పుడీ ఈ కాండ్యూట్ (కాలువ) శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిలో ప్రవహించే నీటిలో 50శాతం వరకూ లీకేజీల ద్వారా వృథాగా పోతోంది. ఉస్మాన్సాగర్ నుంచి 27 ఎంజీడీలు సరఫరా చేసేందుకు అవకాశమున్నా అధికారులు 20 నుంచి 22 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
అయినా, మధ్యలో లీకేజీలు పోను వినియోగదారులకు 8 నుంచి 10 ఎంజీడీలు మాత్రమే చేరుతున్నాయి. ఇంత భారీగా నీరు పోతుండడంతో కాండ్యూట్ను రిపేర్చేయడంతో పాటు, పెరుగుతున్న అవసరాలకు మరింత ఎక్కువ నీటిని డ్రా చేసేందుకు కాలువ పొడవునా మరో కొత్త పైప్లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు.