
- పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఆర్సీ లేకపోతే ఆటోమెటిక్గా చలాన్ పడుద్ది
- త్వరలో కొత్త చలాన్ విధానం అమలు..
- కమాండ్ కంట్రోల్సెంటర్తో ఆర్టీఏ డేటా లింక్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీఏ డేటా బేస్ను కమాండ్కంట్రోల్సెంటర్తో అనుసంధానం చేసి కొత్త చలాన్విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. బుధవారం పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఆర్టీఏ దగ్గరున్న డేటాను కమాండ్కంట్రోల్సెంటర్తో అనుసంధానించాలని నిర్ణయించారు. రూల్స్బ్రేక్చేసే వాహనదారులకు చలాన్వేసే టైంలో పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్వంటివి ఉన్నాయా? లేవా అన్న సమాచారం తెలుస్తుంది.
దీంతో ట్రాఫిక్ పోలీసులకు ఫిజికల్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్చేసే పని తప్పుతుంది. కమాండ్కంట్రోల్సెంటర్నుంచి సమాచారం రాగానే ఆటోమెటిక్గా చలాన్లు జనరేట్ అవుతాయి. ఈ విధానం అమలుపై స్పెషల్టెక్నికల్టీమ్ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సమావేశంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్సిస్టమ్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, వేరియబుల్ మెసేజ్ డిస్ప్లే బోర్డులపై చర్చించారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు శివ లింగయ్య, చంద్రశేఖర్ గౌడ్, ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు.