వెల్లింగ్టన్ (న్యూజిలాండ్): గతేడాది 81 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన పేసర్ జాకబ్ డఫీ టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే న్యూజిలాండ్ టీమ్కు ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంకతో జరిగే మెగా టోర్నీ కోసం న్యూజిలాండ్ బోర్డు బుధవారం మిచెల్ శాంట్నర్ కెప్టెన్సీలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
టీమ్: శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, బ్రేస్వెల్, చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి.
