తెలంగాణలో కొత్తగా 1,451 కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 1,451 కేసులు నమోదు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,451 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,20,675 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి 9మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1265కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,983 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,96,636గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,774 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 18,905 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం 42,497 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 37,89,460 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా మరియు రికవరీ రేటు 89.1 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 235, రంగారెడ్డి 104, మేడ్చల్ 101, భద్రాద్రి 92, నల్గొండ 84, ఖమ్మం 71, కరీంనగర్ 65, సిద్ధిపేట్ 64, వరంగల్ అర్బన్ 55 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

వరద నీటి విషయంలో కొట్టుకున్న కాలనీ వాసులు

గడ్డి కాల్చకుండా ఆపేందుకు స్పెషల్ కమిటీ

పంటలను మద్దతు ధరకే కొంటం.. మరోసారి స్పష్టం చేసిన మోడీ