తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,504 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,35,656 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి అయిదుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,324కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,436 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,16,353గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,979 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. 14,938 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం 41,962 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 41,96,958 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 91.80 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 288, మేడ్చల్ 118, రంగారెడ్డి 115, నల్గొండ 93, ఖమ్మం 84, భద్రాద్రి 83, సిద్ధిపేట్ 73, కరీంనగర్ 66, సిరిసిల్ల 45, వరంగల్ అర్బన్ 44, సూర్యపేట్ 41, కామారెడ్డి 41, నిజామాబాద్ 39, జగిత్యాల్ 38 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

సరుకులు తీసుకొని బిల్ కౌంటర్‌కు వెళ్లకుండా ఇంటికెళ్లొచ్చు

చేతికందే టైంలో మాడుతున్న వరిపంట.. నిండా ముంచిన దోమపోటు

సీజన్ దాటినా చేన్లకే పరిమితమైన చెరుకు పంట