రాష్ట్రంలో మరో 1,708 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 1,708 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,708 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,14,792 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి 5గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1233కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,009 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,89,351గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,208 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 19,748 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం 46,835 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 36,24,096 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా మరియు రికవరీ రేటు 88.15 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 277, రంగారెడ్డి 137, మేడ్చల్ 131, భద్రాద్రి 97, కరీంనగర్ 86, ఖమ్మం 81, నల్గొండ 81, నిజామాబాద్ 66, సిద్ధిపేట్ 65, వరంగల్ అర్భన్ 61, సంగారెడ్డి 59, సూర్యపేట్ 54 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

తాగిన మత్తులో రాత్రంతా కారులో ఏసీ ఆన్ చేసుకొని..