తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,717 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,12,063 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి 5గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1222కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,103 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,85,128గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,713 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 21,209 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 46,657 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 35,47,051 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా మరియు రికవరీ రేటు 87.29 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 276, రంగారెడ్డి 132, మేడ్చల్ 131, కరీంనగర్ 104, నల్గొండ 101, భద్రాద్రి 87, సిద్ధిపేట్ 85, ఖమ్మం 82, సంగారెడ్డి 59, వరంగల్ అర్బన్ 59, సూర్యపేట్ 57, నిజామాబాద్ 53, మహబూబ్‌నగర్ 49, కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

గురుకుల కాలేజీలో 56 మంది స్టూడెంట్లకు కరోనా

డీజీపీకి రాని ఎమ్మెల్యే సీటు కానిస్టేబుల్‌కు వచ్చింది

బాలికతో ఫ్రెండ్‌‌‌‌షిప్ చేస్తుండని కొట్టి చంపిన్రు