రాష్ట్రంలో 1,718 కొత్త కరోనా కేసులు

రాష్ట్రంలో 1,718 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,718 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,97,327 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1153కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,002 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,67,846గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,328 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 23,224 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం 49,084 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 31,53,626 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా మరియు రికవరీ రేటు 85.05 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 285, రంగారెడ్డి 129, మేడ్చల్ 115, కరీంనగర్ 105, నల్గొండ 103, ఖమ్మం 79, సిద్ధిపేట్ 76, కామారెడ్డి 63, సూర్యపేట్ 60, నిజామాబాద్ 58, వరంగల్ అర్బన్ 56, భద్రాద్రి 55, సిరిసిల్ల 52, మహబూబా బాద్ 52 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

కమీషన్లతోనే కేసీఆర్​ ధనవంతుడైండు

ప్రాపర్టీ సర్వేలో ఇంటికి రూ.50 వసూలు

కేసీఆర్ తర్వాత నేనే: మంత్రి ఎర్రబెల్లి