తెలంగాణలో మరో 1,967 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1,967 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,967 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,85,833 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి 9 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1100కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,058 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,54,499గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,234 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 24,607 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 50,108 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 28,50,869 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా మరియు రికవరీ రేటు 83.13 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 297, కరీంనగర్ 152, రంగారెడ్డి 147, మేడ్చల్ 137, నల్గొండ 105, భద్రాద్రి 91, వరంగల్ అర్బన్ 89, ఖమ్మం 78, సిద్ధిపేట్ 70, మహబూబా బాద్ 66, నిజామాబాద్ 61, సూర్యపేట్ 63, సిరిసిల్ల 57, కామారెడ్డి 56, జగిత్యాల 56, సంగారెడ్డి 54 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

నా దగ్గర మిగిలింది ఒకే కారు.. ఖర్చుల కోసం బంగారం కూడా అమ్మానంటున్న అనిల్ అంబానీ

జర్నలిస్టులు 90 రోజులకు మించి మా దేశంలో ఉండొద్దు!

చితి మీద పెట్టిన తర్వాత శవం మారిందని ఫోన్.. ఆగిన అంత్యక్రియలు