తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,154 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,04,748 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1189కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,239 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,77,008గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,551 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 21,864 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 54,277 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 33,46,472 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా మరియు రికవరీ రేటు 86.45 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 303, రంగారెడ్డి 205, మేడ్చల్ 187, నల్గొండ 124, ఖమ్మం 121, కరీంనగర్ 96, భద్రాద్రి 92, సూర్యపేట్ 79, సిద్ధిపేట్ 78, వరంగల్ అర్బన్ 74, కామారెడ్డి 71, సంగారెడ్డి 63, నిజామాబాద్ 60 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

బిడ్డ మరణం తట్టుకోలేక తండ్రి సూసైడ్

గల్ఫ్‌‌‌‌ కార్మికుల కష్టాలపై ఏం చర్యలు తీసుకుంటున్రు

కరోనా సోకినా.. ప్రాపర్టీ సర్వే చేస్తున్న విలేజ్ సెక్రటరీ