రాష్ట్రంలో మరో 2,734 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 2,734 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,734 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,27,697 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 9 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 836కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,325 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 95,162గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,699 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. మరో 24,598 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14,23,846 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం ఒక్కరోజే 58,264 పరీక్షలు చేశారు.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 347, రంగారెడ్డి 212, నల్గొండ 191, ఖమ్మం 161, మేడ్చల్ 121, భద్రాద్రి 117, నిజామాబాద్ 114, వరంగల్ అర్బన్ 112, సిద్ధిపేట్ 109, సూర్యపేట్ 107, కరీంనగర్ 106, జగిత్యాల 97, మంచిర్యాల్ 96, మహబూబా బాద్ 81, యాదాద్రి 76, పెద్దపల్లి 74, కామారెడ్డి 72, మహబూబ్ నగర్ 66, కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

జలపాతంలో మిస్సైన యువకుడి మృతదేహం లభ్యం

ఆ స్నేహంతోనే తెలంగాణ కోసం సపోర్ట్ చేసిండు

రెండుసార్లు చేజారిన పీఎం చాన్స్