తెలంగాణలో కొత్తగా 2,892 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,892 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,892 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,30,589 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 846కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,240 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 97,402గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,341 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. మరో 25,271 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14,83,267 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 59,421 పరీక్షలు చేయగా.. అందులో 2,892 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 477, రంగారెడ్డి 234, మేడ్చల్ 192, నల్గొండ 174, కరీంనగర్ 152, ఖమ్మం 128, నిజామాబాద్ 110, సిద్ధిపేట్ 108, సూర్యపేట్ 108, జగిత్యాల 102, పెద్దపల్లి 85, మంచిర్యాల్ 83, భద్రాద్రి 81, సంగారెడ్డి 71, మహబూబా బాద్ 61, కామారెడ్డి 64, మహబూబ్ నగర్ 53 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

టీఎంయూలో పదవి కోసం పోరు

రాష్ట్రంలో లక్ష టన్నుల యూరియా కొరత

హైదరాబాద్‌‌‌‌లో సాదాసీదాగా నిమజ్జనం