తెలంగాణలో మరో 948 కరోనా కేసులు

తెలంగాణలో మరో 948 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 948 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,59,776 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి అయిదుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,415కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,607 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,45,293గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,068 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 10,710 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 42,433 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 49,72,407 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 94.42 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 154, మేడ్చల్ 83, రంగారెడ్డి 76, భద్రాది 61, కరీంనగర్ 55, నల్గొండ 45, ఖమ్మం 44, వరంగల్ అర్బన్ 40 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

కూలీలుగా మారిన ఫీల్డ్​ అసిస్టెంట్లు

క్లోజ్ ఫ్రెండ్‌తో గొడవలా.. అయితే ఇలా చేయండి

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో