పెళ్లయిన ఐదు రోజులకే నవ వధువు మృతి

పెళ్లయిన ఐదు రోజులకే నవ వధువు మృతి
  • డాక్టర్ల నిర్లక్ష్యంతో నవ వధువు మృతి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పెళ్లయిన ఐదు రోజులకే నవ వధువు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగింది. బంధువుల వివరాల ప్రకారం.. టౌన్​కు చెందిన శ్రీవాణికి తాండూరుకు చెందిన నవీన్​తో ఈనెల14న పెళ్లయింది. బుధవారం ఇద్దరూ గుడికి వెళ్లి ఇంటికి వచ్చారు. కొద్దిసేపటికి శ్రీవాణి వాంతులు చేసుకుంది. తర్వాత స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. కరోనా అనుమానంతో అక్కడి డాక్టర్లు వైద్యం చేయలేదు. కరోనా టెస్టు చేయించాకే ట్రీట్​మెంట్​చేస్తామని చెప్పారు. శాంపిల్​ తీసుకున్న కాసేపటికి ఆమె మృతి చెందింది.