చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంధువులు, పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న ఓ పెళ్లింట్లో రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. రొంపిచర్ల మండలంలోని చెంచన్నరెడ్డిగారిపల్లెలో జరిగిన ప్రమాదంలో నవ వరుడు చాంద్బాషా (22) మృతి చెందాడు. బైక్ పై వస్తున్న చాంద్బాషాను మరో వాహనం ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. చాంద్ బాషాకు శుక్రవారం మధ్యాహ్నమే వివాహమైంది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. దీంతో ఆ ఇంట్లో శోకం నెలకొంది.