హామిల్టన్: విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 రన్స్ చేసింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతున్న కివీస్ ను వస్త్రాకర్ రన్ ఔట్ చేయడమే కాకుండా.. తన ఫస్ట్ ఓవర్ లోనే మరో వికెట్ తీసింది. దీంతో కాస్త నెమ్మదించిన కివీస్ ఆ తర్వాత పుంజుకుంది. అమెలి కెర్(50), సాటర్త్వైట్(75) చెరో హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో కివీస్ స్కోర్ 300 పరుగులు దాటేలా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరు ఔట్ కావడంతో..260 రన్స్ కు ముగిసింది. పాక్ తో జరిగిన ఫస్ట మ్యాచ్ లో భారత్ ను గెలిపించిన పూజా వస్త్రాకర్.. ఇవాళ్టి మ్యాచ్ లోనూ 4 వికెట్లు పడగొట్టి.. కివీస్ ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషింంచింది.
భారత బౌలర్లలో.. పూజా వస్త్రాకర్(4), రాజేశ్వరీ(2) జులన్ గోస్వామి(1), దీప్తిశర్మ(1) వికెట్లు తీశారు.
#TeamNewZealand finish their innings at 260/9.
— ICC Cricket World Cup (@cricketworldcup) March 10, 2022
Amelia Kerr and Amy Satterthwaite were the main stars for the home team.
Can #TeamIndia chase this total?#CWC22 pic.twitter.com/M9rr8wcbKI