చేవెళ్లలో కాలె యాదయ్య గెలుపు ఖాయం: పట్నం మహేందర్ రెడ్డి

చేవెళ్లలో కాలె యాదయ్య గెలుపు ఖాయం: పట్నం మహేందర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: గత 50 ఏండ్లలో జరగని అభివృద్ధి చేవెళ్ల సెగ్మెంట్​లో 5 ఏండ్లలో చేసి చూపించామని, రాబోయే రోజుల్లో మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో చేవెళ్లలోబీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాలె యాదయ్య గెలుపు ఖాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం షాబాద్ మండలంలోని నగర్​గూడ గ్రామం నుంచి షాబాద్ వరకు జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కాలె యాదయ్య వేల బైక్​లతో ప్రజా ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు.

మంత్రి మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ తీగల అనితా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొని కాలె యాదయ్య తరఫున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ మేనిఫెస్టోను చూసి ప్రతిపక్షాలు చతికిలపడ్డాయన్నారు. యాదయ్యకు కేసీఆర్ రెండోసారి భీఫామ్ ఇచ్చారని.. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని  ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. తనను గెలిపిస్తే చేవెళ్లను మరింతగా అభివృద్ధి చేస్తానని కాలె యాదయ్య హామీ ఇచ్చారు. చేవెళ్లలోని సింగప్పగూడ, న్యాలట, రామన్నగూడ గ్రామాల్లో యాదయ్య ప్రచారం నిర్వహించారు.  జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు.