టెర్రరిస్టుల నెట్ వర్క్ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఛేదించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్ లోని 40 ప్రాంతాల్లో దాడులు చేశారు. లష్కరే తోయిబా, అల్ బదర్ సహా పలు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో పట్టుబడ్ట ఉగ్రవాదిని పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను నకిలీ భారత పౌరసత్వ కార్డుతో దేశంలో తిరుగుతున్నాడన్నారు పోలీసులు. మరోవైపు కేరళ, తమిళనాడు, కర్నాటకలో 20 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో పలువురి ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం...
గ్యాస్ పై రాష్ట్రం పన్నువేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: హరీశ్ రావు
వారం తర్వాత ఆగిన పెట్రో రేట్ల పెరుగుదల
టాలీవుడ్లో చీలిక.. కొత్త అసోసియేషన్ ‘ఆత్మ’?