ట్విట్టర్ ను నిషేధించిన నైజీరియా

ట్విట్టర్ ను నిషేధించిన నైజీరియా

ఆఫ్రికా దేశం నైజీరియా ట్విట్టర్ పై కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ట్విట్టర్ కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. నిరవధికంగా ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఆ దేశ సమాచార శాఖ తెలిపింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ అకౌంటన్ ను ట్విట్టర్ ఆపేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తమ రూల్స్ ను ముహమ్మదు అతిక్రమించారంటూ ఆయన అకౌంట్ ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. సాక్షాత్తు అధ్యక్షుడి ఖాతానే నిలిపేయడంతో.. ఆ దేశ ప్రభుత్వం ఫైర్ అయింది. ఇటీవలి కాలంలో ట్విట్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మంది ప్రముఖులకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి అకౌంట్ కు  కూడా బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే తప్పును సరిదిద్దుకుంది.