హైదరాబాద్లో నైజీరియన్ పెడ్లర్స్ అరెస్ట్.. రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్లో నైజీరియన్ పెడ్లర్స్ అరెస్ట్.. రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా నార్కోటిక్స్ పోలీసులు డ్రగ్స్ నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. చాలా వరకు తెలంగాణలో డ్రగ్స్ సరఫరా ఆగిపోయిందని అనుకునే లోపే.. అక్కడక్కడ మళ్లీ ఈ మహమ్మారిని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం (జూన్ 2) దాదాపు రూ.కోటీ 25 లక్షల విలువైన  డ్రగ్స్ తో ఇద్దరు నైజీరియన్లు పట్టుబడటం ఆందోళన కలిగించింది. 

హైదరాబాద్ లో నార్కోటిక్ బృందం నైజీరియన్ పెడ్లర్‌ను అరెస్ట్ చేసింది. రూపాయలు 1.25 కోట్లు విలువ చేసే కొకైన్ డ్రగ్స్ ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ మాక్స్ వెల్  నుంచి సైకోట్రోపిక్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరో ఇద్దరు డ్రగ్స్ నిందితులు ఒమైసీ,  కెన్నెత్  పరారయ్యారు. మెడికల్ వీసా పై వచ్చిన  నైజీరియన్ల పై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు నార్కోటిక్స్ పోలీసులు. గోవా నుంచి  హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్  అమ్మకాలు జరుగుతున్నాయని ఈ సందర్బంగా తెలిపారు.