కుమారస్వామి కొడుకు, హీరో నిఖిల్ ఓటమి 

కుమారస్వామి కొడుకు, హీరో నిఖిల్ ఓటమి 

జేడీఎస్ కు బిగ్ షాక్ తగిలింది. జేడీఎస్ అధినేత హెచ్‌డి  కుమారస్వామి కొడుకు, హీరో నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన..  కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ చేతిలో 13,459 ఓట్లతో ఓడిపోయారు.  

కుమారస్వామి కుటుంబానికి కంచుకోట అయిన రామనగర అసెంబ్లీ సీటును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది.  కుమార‌స్వామి భార్య రామ‌న‌గ‌ర నుంచి టికెట్ ను త్యాగం చేసి నిఖిల్ కుమార‌గౌడ కు అవ‌కాశం ఇచ్చారు. అయినప్పటికీ జేడీఎస్ తన కంచుకోటను కాపాడుకోలేకపోయింది.  

2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యాలో నటి సుమలత అంబరీష్ పై పోటీ చేసి ఓడిపోయారు నిఖిల్ కుమారస్వామి. ఇక   హెచ్‌డి  కుమారస్వామి చెన్నపట్టణ నుంచి గెలుపొందారు.