హైదరాబాద్  నేరెడ్‌‌మెట్– వినాయక్ నగర్ రూట్లో  ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్  నేరెడ్‌‌మెట్– వినాయక్ నగర్ రూట్లో  ట్రాఫిక్ ఆంక్షలు

మల్కాజ్‌‌గిరి :  వాజ్‌‌పేయి నగర్ రైల్వే గేట్ వద్ద చేపట్టనున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులు మంగళవారం నుంచి మొదలుకానుండడంతో పోలీసులు ట్రాఫిక్​ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నేరెడ్‌‌మెట్ ఎక్స్ రోడ్ నుంచి వినాయక్ నగర్ జంక్షన్, సఫిల్‌‌గూడ రూట్​లో వెళ్లే వాహనాలకు రెండు మార్గాలను సూచించారు. మొదటిది -నేరెడ్‌‌మెట్ ఎక్స్ రోడ్డు నుంచి సైనిక్‌‌పురి, కెనరా బ్యాంక్ జంక్షన్, ఓల్డ్ సఫిల్‌‌గూడ, వినాయక్ నగర్ మీదుగా ఆనంద్‌‌బాగ్ వైపు వెళ్లడం కాగా, రెండోది వాయుపురి, కాకతీయ నగర్, నేరెడ్‌‌మెట్ పాత పీఎస్ సర్కిల్, వినాయక్ నగర్ మీదుగా ఆనంద్‌‌బాగ్‌‌కు చేరుకోవడం..అలాగే, సఫిల్‌‌గూడ, వినాయక్ నగర్ జంక్షన్ల నుంచి నేరెడ్‌‌మెట్ ఎక్స్ రోడ్ దిశగా వెళ్లే వాహనాలను ఓల్డ్ సఫీల్‌‌గూడలోని డి-మార్ట్ మీదుగా మళ్లించనున్నారు. వినాయక్ నగర్ డి-మార్ట్, ఓల్డ్ సఫిల్‌‌గూడ, కెనరా బ్యాంక్ జంక్షన్, సైనిక్‌‌పురి రూట్​లేదా నేరెడ్‌‌మెట్ పాత పీఎస్ సర్కిల్, కాకతీయ నగర్, వాయుపురి మార్గం ద్వారా నేరెడ్‌‌మెట్ ఎక్స్ రోడ్‌‌కు చేరుకోవచ్చని వివరించారు.

ఉత్తమ్ నగర్‌‌లోనూ.. 

మల్కాజ్‌‌గిరి : మల్కాజ్‌‌గిరి ట్రాఫిక్ పీఎస్​పరిధిలోని ఉత్తమ్ నగర్ టీ -జంక్షన్ నుంచి ఏవోసీ రోడ్డు వరకు మంగళవారం నుంచి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఉత్తమ్ నగర్ టీ -జంక్షన్ వద్ద ఆనంద్‌‌బాగ్ ఎక్స్ రోడ్, గౌతమ్ నగర్, మల్కాజ్‌‌గిరి వైపు నుంచి వచ్చే వాహనాలను ఏవోసీ జంక్షన్ వైపు అనుమతించరు. వీరు గౌతమ్ నగర్ రోడ్డు మీదుగా తుకారామ్ గేట్ మెయిన్ రోడ్డు, ఈస్ట్ మారేడ్‌‌పల్లి రోడ్డు మీదుగా ఏవోసీ జంక్షన్‌‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఏవోసీ జంక్షన్ నుంచి ఉత్తమ్ నగర్ టీ -జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ఈస్ట్ మారేడ్‌‌పల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు. ఈ వాహనాలు ఈస్ట్ మారేడ్‌‌పల్లి రోడ్డు, తుకారామ్ గేట్ మెయిన్ రోడ్డు, గౌతమ్ నగర్ రోడ్డు మీదుగా ఉత్తమ్ నగర్ టీ -జంక్షన్‌‌ చేరుకోవాలి.