వాషింగ్టన్: సౌత్ కరోలినా గవర్నర్, రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ కుమారుడు నలిన్ హేలీ భారత్పై తీవ్ర విమర్శలు చేశాడు. యునైటెడ్ స్టేట్స్కు భారత్ మంచి మిత్రదేశం కాదని పోస్ట్ చేశాడు. తనను తాను మేక్అమెరికా గ్రేట్అగైన్(ఎంఏజీఏ) ప్రతినిధిగా చెప్పుకునే నలిన్.. శుక్రవారం ఇండియన్ -అమెరికన్ పాలిటికల్ ఫిగర్ వివేక్ రామస్వామి గురించి ఒక వీడియోను కోట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టాడు. ఇరాన్ నుంచి చమురు, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూ.. భారత్ అమెరికాకు చీప్ లేబర్ను పంపుతోందని ఆరోపించాడు.
అలాగే, ఈ సమస్య కేవలం భారత్కు సంబంధించినది మాత్రమే కాదని, అమెరికా ఇతర మిత్రదేశాలతో ఉన్న సంబంధాలను కూడా పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
