
ఏపీ కొత్త ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. నీలం సాహ్ని ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా ఉన్నారు. ఈ నెల 31 తో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ముఖ్య సలహాదారు పదవికి రాజనామా చేసిన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు నీలం సాహ్ని.