నీలోఫర్ కు రాకముందే బాలుడు చనిపోయాడు

నీలోఫర్ కు రాకముందే బాలుడు చనిపోయాడు

నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ వికటించి అస్వస్థతకు గురైన 15 మంది చిన్నారులు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు  హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళి కృష్ణ తెలిపారు. నిన్న సాయంత్రం నీలోఫర్ ఆసుపత్రికి పిల్లలను తీసుకొచ్చారని .. ఇందులో ముగ్గురు చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన వివరించారు. వ్యాక్సిన్ వికటించి ఆసుపత్రికి రాకముందే 18 నెలల చిన్నారి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్యారాసిటిమాల్ స్థానంలో ట్రెమొడల్ టాబ్లెట్ ఇవ్వడం వల్లనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు సూపరింటెండెంట్ తెలిపారు.