కశ్మీర్ ఎన్ కౌంటర్ లో 9 మంది ఉగ్రవాదులు హతం

కశ్మీర్ ఎన్ కౌంటర్ లో 9 మంది ఉగ్రవాదులు హతం

ఓ వైపు కరోనా సమస్యతో సతమతమవుతోంటే…మరోవైపు ఉగ్రవాదులు తమ పని తాము చేసుకుపోతున్నారు. జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు ప్రయత్నాలు జరుపుతున్నారు. కశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో 9మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.

ఇవాళ ఉదయం(ఆదివారం) కెరాన్‌ సెక్టార్‌ నియంత్రణ రేఖ దగ్గర ఐదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే అలర్టై కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

భద్రతా బలగాల కాల్పుల్లో బత్‌పురా దగ్గర నిన్న(శనివారం) నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచరంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి.