పబ్లిసిటీ కోసం ప్రశాంత్‌ కిషోర్‌ చాలా మాట్లాడతాడు : నితీష్ కుమార్

పబ్లిసిటీ కోసం ప్రశాంత్‌ కిషోర్‌ చాలా మాట్లాడతాడు : నితీష్ కుమార్

తనపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన కామెంట్స్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. నితీష్ కుమార్ బీజేపీతో ఇంకా టచ్ లోనే ఉన్నారని, పరిస్థితులు కోరితే ఆ పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకుంటారని ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. " పబ్లిసిటీ కోసం ప్రశాంత్‌ కిషోర్‌ చాలా మాట్లాడుతారు. ప్రస్తుతం అతను వయసు మీద ఉన్నారు కాబట్టి ఏది కావాలంటే అది మాట్లాడగలరు. మేము వాటిని పట్టించుకోం. ఒకప్పుడు నేను అతన్ని గౌరవించాను. కానీ, అతను మాత్రం నన్ను అగౌరవపరిచారు" అని నితీష్ కుమార్ అన్నారు.  

అంతకుముందు.. అవసరమైతే నితీష్ కుమార్ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని, ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ద్వారా బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న నితీష్..ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బతికున్నంత వరకూ బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోనని నితీష్ కుమార్ ఇటీవల శపథం చేశారు.