V6 News

ఇంటర్ టాపర్స్కు డీఈవో సన్మానం

ఇంటర్ టాపర్స్కు డీఈవో సన్మానం

నిజామాబాద్, వెలుగు: ఇంటర్​ఫలితాల్లో నిజామాబాద్​కాకతీయ విద్యాసంస్థల ఆధ్వర్యంలోని జూనియర్​కాలేజీ స్టూడెంట్స్​ఉత్తమ మార్కులు సాధించగా వారిని డీఈవో సన్మానించారు. సెకండియర్​ఎంపీసీలో ఎం.మృదుల 996 మార్కులతో టాపర్​గా నిలిచింది. బైపీసీలో తుబాఫాతిమా 993 మార్కులు సాధించింది. ఎంపీసీలో బి.కావ్యశ్రీ 993, వై.గౌతమి 991, బైపీసీలో హనియ ఉమేమ 991 మార్కులు తెచ్చుకున్నారు.

కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి డీఈవో అశోక్​కుమార్​హాజరై 984 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 12 మందిని, ఇంటర్ ఫస్టియర్​లో468 కంటే ఎక్కువ మార్కులు స్కోర్​చేసిన తొమ్మిది మందిని సన్మానించారు.  కాకతీయ విద్యా సంస్థల చైర్​పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్లు రజినీకాంత్, తేజస్విని, రామోజీరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.