- ఔట్ పేషెంట్లకు తప్పని ఇబ్బందులు
- గోల్కొండ, మలక్ పేట్, నాంపల్లి ఆస్పత్రుల్లో 43 ఏళ్లుగా వంద పడకలే
- వనస్థలిపురం, కొండాపూర్ జిల్లా హాస్పిటల్స్ లోనూ ఇదే పరిస్థితి
- వాటిలో పెంచితే టీచింగ్ ఆస్పత్రులపై తగ్గనున్న పేషెంట్ల రద్దీ
- పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ( టీవీవీపీ ) పరిధిలోని ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బెడ్స్ సాల్తలేవు. పేషెంట్లు ఇబ్బందులు పడుతూనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. గ్రేటర్లో 5 ఏరియా ఆస్పత్రులు, 7 కమ్యూనిటీ హెల్త్సెంటర్లు ఉన్నాయి. ఇందులో గోల్కొండ , నాంపల్లి, మలక్ పేట్ ఏరియా హాస్పిటల్స్ని 43 ఏళ్ల కిందట 100 పడకలతో నిర్మించారు. 20 ఏళ్ల కిందట వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 100, కొండాపూర్జిల్లా హాస్పిటల్లో 200 పడకలతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా ఆస్పత్రుల్లో బెడ్స్పెంచలేదు. వీటితో పాటు పానీపురా, శ్రీరామ్నగర్, జంగంమ్మెట్, అంబర్పేట్, డబీర్పురా, లాలాపేట్ అర్బన్కమ్యూనిటీ హెల్త్సెంటర్లది ఇదే పరిస్థితి. ఒక్కో సెంటర్లో ప్రారంభ సమయంలో10 బెడ్స్ ను ఏర్పాటు చేశారు. బార్కాస్ కమ్యూనిటీ హెల్త్సెంటర్లో 50 బెడ్స్ఉండగా అక్కడ కూడా అదనంగా బెడ్స్ లేవు. ఆయా హాస్పిటల్స్ లో బెడ్స్ని పెంచకపోవడంతో టీచింగ్ఆస్పత్రులకు పేషెంట్ల రద్దీ పెరుగుతుంది. చిన్న జబ్బులకు ట్రీట్మెంట్కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్ లో అందితే పెద్దాసుపత్రుల దాకా వచ్చే పరిస్థితి ఉండదు. సర్కార్సిటీ నలువైపులా సూపర్స్పెషాలిటీ హాస్పిటల్స్కట్టుడేమో కానీ ఉన్నవాటిని మాత్రం పట్టించుకోవడంలేదు.
కరోనా సమయంలోను పట్టించుకోలె
కరోనా మొదలైనప్పటి నుంచి ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బెడ్స్ని పెంచడంపై ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టలేదు. బెడ్స్అదనంగా పెంచి స్టాఫ్ ని కూడా రిక్రూట్చేసుంటే వేలాది మంది కరోనా పేషెంట్లకు మెరుగైన ట్రీట్ మెంట్అందేది. కరోనా తీవ్రత ఉన్నప్పుడు వీటిలో కొన్ని బెడ్స్ని పేషెంట్లకు కేటాయించారు. ఏరియా హాస్పిటల్స్ కి వచ్చే కేసుల్లో ఎక్కువగా గర్భిణులు ఉంటున్నారు. ఐదు ఏరియా ఆస్పత్రుల్లో నెలకు 1,100 డెలివరీలు అవుతుంటాయి. వాటిలో ఉన్న బెడ్లలో సగం వరకు బాలింతలకు కేటాయి స్తారు. ఎప్పుడు డెలివరీ కేసులు వస్తాయో తెలియక మరో 10 బెడ్స్రెడీగా ఉంటాయి. మిగిలిన బెడ్స్మాత్రమే ఇతర పేషెంట్లకు కేటాయిస్తుంటారు.
ఖాళీ లేవంటూ వేరే ఆస్పత్రులకు రెఫర్
ప్రతి ఏరియా ఆస్పత్రికి డైలీ500 లకు పైగా పేషెంట్లు వెళ్తుంటారు. అడ్మిట్అవసరమైన వారిని బెడ్స్ లేక చేర్చుకోకుండానే వేరే ఆస్పత్రులకు డాక్టర్లు రెఫర్చేస్తున్నారు. సీజనల్ కేసులు కొద్దిగా పెరిగాయంటే బెడ్స్దొరకడం కష్టంగా ఉంటుంది. దీంతో టీచింగ్ఆస్పత్రులకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అర్బన్కమ్యూనిటీ హెల్త్సెంటర్లలోనై తే ఓపీ సేవలే ఉన్నాయి. ప్రతి సెంటర్లో 10 బెడ్స్ఉన్నా ఇన్ పేషెంట్గా అడ్మిట్అయ్యేది చాలా తక్కువ. ఎమర్జెన్సీ డెలివరీ కేసులు వస్తే వేరే ఆస్పత్రికే రెఫర్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కొత్తగా ఏర్పాటు చేయట్లే ..
ఖైరతాబాద్, అమీర్ పేట్ లో కొత్తగా కమ్యూనిటీ హెల్త్సెంటర్ల ఏర్పాటు ఏండ్లుగా సాగుతోంది. ఖైరతాబాద్ లో 100 పడకల హాస్పిటల్ను ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్మించినా నేటికి ప్రారంభించలేదు. అమీర్పేట్లోను ఏర్పాటు కోసం కొంతమంది స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా పూర్తయింది. మరికొన్నాళ్ల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
త్వరలో బెడ్స్ పెంచుతాం
గోల్కొండ, మలక్ పేట్ఏరియా ఆస్పత్రుల్లో త్వరలో బెడ్లు పెంచుతాం. కరోనా థర్డ్వేవ్ని దృష్టిలో పెట్టుకొని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తున్నాం. ఖైరతాబాద్, అమీర్ పేట్ ఆస్పత్రులను ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో ఓపెన్చేస్తాం. - డాక్టర్సునీత, డీసీహెచ్ఎస్, హైదరాబాద్ జిల్లా