
- గైడ్లైన్స్లో కంపల్సరీ అని పేర్కొన్న రాష్ట్ర సర్కారు
- అవసరం లేదన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్న అధికారులు
- సిబిల్పరిశీలనకు బ్యాంకర్లకు రేపటికే తుది గడువు
- అయోమయంలో యువ వికాసం దరఖాస్తుదారులు
మంచిర్యాల, వెలుగు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం అమలు చేసే రాజీవ్యువ వికాసం స్కీమ్ లో సిబిల్స్కోర్పై అయోమయం నెలకొంది. స్కీమ్ గైడ్లైన్స్లో లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ కంపల్సరీ అని పేర్కొనడంపై విమర్శలు రావడంతో మూడురోజుల కింద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.
సిబిల్స్కోర్చూడాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. కానీ ఆఫీసర్లు మాత్రం సిబిల్ స్కోర్ మినహాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొంటున్నారు. మరోవైపు ఈనెల 17లోగా దరఖాస్తుదారుల సిబిల్స్కోర్పరిశీలించి బ్యాంక్కన్సెంట్అందజేయాలని ఆదేశాలున్నట్టు బ్యాంకర్లు చెప్తున్నారు. రెండు రోజుల గడువు మాత్రమే ఉండడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
5 లక్షల యూనిట్లు.. 16 లక్షలకు పైగా అప్లికేషన్లు
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం రాష్ర్ట ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను తీసుకొచ్చింది. వివిధ రంగాల్లో స్కిల్డెవలప్మెంట్ట్రైనింగ్ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్లు పెట్టుకునేలా ఎంకరేజ్చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డి గత మార్చి 15న స్కీమ్ను లాంఛనంగా ప్రారంభించారు. రూ.6వేల కోట్లతో 5 లక్షల మందికి యూనిట్లు సాంక్షన్చేస్తామని ప్రకటించారు. దీంతో ఆన్లైన్లో భారీగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ర్టవ్యాప్తంగా 16.23 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.
బ్యాంక్ కాన్సెంట్ ఇస్తేనే..
స్కీమ్ కింద యూనిట్కాస్ట్ను బట్టి 100 నుంచి 70 పర్సెంట్వరకు రాష్ట్ర సర్కారు సబ్సిడీ ఇస్తోంది. మిగతా మొత్తానికి బ్యాంక్లోన్సాంక్షన్ చేస్తుండగా.. ఇక్కడే సమస్య తలెత్తింది. దరఖాస్తుదారుల సిబిల్స్కోర్ ఆధారంగానే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. రాజీవ్యువ వికాసం గైడ్లైన్స్లో కూడా అలానే పేర్కొనడంతో ఇబ్బందులు వచ్చిపడ్డాయి. నిరుద్యోగ యువతకు లోన్లు మంజూరు చేసేముందు బ్యాంకింగ్ వారి రికార్డులు, అప్పు చెల్లింపు సామర్థ్యం, గత రుణ చరిత్రలపై పరిశీలన చేస్తాయి.
మెరుగైన సిబిల్స్కోర్ ఉన్న అభ్యర్థులకే బ్యాంకర్లు లోన్ కాన్సెంట్ఇచ్చే చాన్సుంది. ఈ స్కీమ్ కింద రూ.50వేల యూనిట్కు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ అందిస్తుండగా. రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, 10 శాతం బ్యాంక్లోన్, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 పర్సెంట్సబ్సిడీ, 20 శాతం లోన్, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ఇస్తుండగా, బ్యాంకులు 30 శాతం లోన్ ఇవ్వాల్సి ఉంటుంది.