కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది కూడా చేపప్రసాదం పంపిణీ నిలిపివేస్తున్నట్లు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉండటం..అదే సమయంలో లాక్ డౌన్ ఉండటంతో.. గతేడాది కూడా ఈ ప్రసాదం పంపిణీ జరగలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచనతో ఈ ఏడాది కూడా చేప ప్సాదం పంపిణీ నిలిపివేస్తున్నట్లు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది.
అయితే మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్ 7వ తేదీన దూద్బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు హరినాథ్ గౌడ్. 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామన్నారు.