స్కూళ్లు ఇప్పట్లో తెరిచే ఆలోచనలేదు: కేంద్రం

స్కూళ్లు ఇప్పట్లో తెరిచే ఆలోచనలేదు: కేంద్రం

త్వరలోనే దేశంలో అన్ లాక్ 4.0 ప్రక్రియ షురూ కానుంది.  లేటెస్టుగా అన్ లాక్ పై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఇప్పట్లో స్కూళ్లు తెరిచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ ప్రకటించబోయే ఆంక్షల సడలింపులో స్కూళ్లు ఉండవని తెలిపారు.

మరోవైపు మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు, బస్సులు తిరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల నుంచి మెట్రో సేవలపై డిమాండ్లు వస్తుండటంతో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, స్కూళ్లు, సినిమా థియేటర్లు, బార్ల కు ఇప్పుడే అనుమతి ఇచ్చేలా కన్పించడం లేదు. అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్రం ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశాలున్నాయి.