తప్పు చేస్తే నాకు ఓటు వేయొద్దు : గువ్వల బాలరాజు

తప్పు చేస్తే నాకు ఓటు వేయొద్దు : గువ్వల బాలరాజు
  •   విప్​ గువ్వల ఆసక్తికర వ్యాఖ్యలు

వంగూరు, వెలుగు : ‘నేను ఎలాంటి తప్పు చేసినా వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా నాకు బుద్ధి చెప్పాలి’ అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వంగూరుకు వచ్చిన గువ్వలకు వంగూరు, చారకొండ మండలాల బీఆర్ఎస్  నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

మండల కేంద్రంలోని ఫూలే, అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నియోజకవర్గం ప్రతిష్టను దిగజార్చే, ప్రజలకు నష్టం చేసే పనులు చేస్తే తనను ఓటు ద్వారా శిక్షించాలని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేసినట్లు తెలిపారు.