కేసీఆర్ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం ఆగదు : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం ఆగదు : వివేక్ వెంకటస్వామి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అరెస్టు చేయడం చూస్తుంటే ప్రభుత్వంలో ఎంత భయముందో కనిపిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని వాళ్లకు అర్థమైంది కాబట్టే ఇలా చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజల సమస్యలపై మాట్లాడడానికి ప్రతిపక్షాలు మాట్లాడాలని అంబేడ్కర్ రాజ్యాంగంలో రాశారని, దాన్ని సీఎం కేసీఆర్ పక్కనబెట్టి, నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శించారు. 

సీఎంను గద్దె దించే వరకు బీజేపీ నేతలు, కార్యకర్తలంతా పనిచేస్తారని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏం చేసినా, ఎంత మందిని అరెస్ట్ చేసినా, జైళ్లో పెట్టినా మీకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుందని చెప్పారు. బండి సంజయ్ ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

https://youtu.be/jDJcK7Z-xNw