 
                                    - అవగాహనతో ప్రమాదాలు నివారిస్తం
- పోస్టర్ ఆవిష్కరణలో డైరెక్టర్ అమితాబ్ మురార్క
హైదరాబాద్సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను నివారించేందుకు ‘ఓఆర్ఆర్పై నో పార్కింగ్’ అనే ప్రచారానికి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రచారం చేపట్టింది. ప్రస్తుతం ఓఆర్ఆర్ పై టోల్వసూళ్ల లీజును ఈ సంస్థనే కలిగి ఉంది. ప్రమాదాన్ని సూచించే లైట్లు లేదా రిఫ్లెక్టివ్ వార్నింగ్ పరికరాలు ఏవీ లేకుండానే భారీ వాహనాలను పార్క్చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంతో హెచ్ఎండీఏ, ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ తో కలిసి నెల రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా నో పార్కింగ్పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే డైరెక్టర్ అమితాబ్ మురార్క మాట్లాడుతూ.. ప్రచారంలో భాగంగా డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారాలు, వాణిజ్య డ్రైవర్లు, లాజిస్టిక్ సంస్థల నిర్వాహకులు, ప్రైవేటు వాహనాల యజమానులతో సెషన్లు నిర్వహిస్తామన్నారు.

 
         
                     
                     
                    