- ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 17.65 శాతం డీఏ ఖరారు చేస్తూ వచ్చిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచీ ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్ (డీఏ), డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) ను సమీక్షిస్తూ డిప్యూటీ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో భాగంగా ఈ సంవత్సరం నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఎ, డీఆర్ను 17.651 శాతంగా ఖరారు చేశారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. పెంచిన డీఏ ప్రకారం టీజీ ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి లబ్ధి చేకూరనుంది.
