ఆంధ్రా నీళ్లలో క్వాలిటీ లేదట!

ఆంధ్రా నీళ్లలో క్వాలిటీ లేదట!

ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి,తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీ సీబీ) సీకేటగిరీ రేటింగ్ ఇచ్చింది. అంటే నీళ్ల నాణ్యత చాలా తక్కువగా ఉందని అర్థం . పొరపాటున ‘కేటగిరీ డీ’కిక్వాలిటీ పడిపోతే, ఆ నీళ్లిక తాగడానికి పనికిరావు.గతేడాది కూడా నదుల నీళ్లకు సీ రేటింగ్ వచ్చింది.దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ట్రైబ్యులన్(ఎన్జీటీ) ఏపీ సర్కారును ఆదేశించింది. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా .. ఏపీ సర్కారు నదుల వైపు కనీసం తిరిగి కూడా చూడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పీహెచ్, ఆక్సిజన్, బయలాజికల్ఆక్సిజన్ డిమాండ్, కొలిఫార్మ్, టోటల్ డిసాల్వ్ డ్సాలిడ్స్(టీడీఎస్) ను ఏపీపీ సీబీ పరీక్షించింది. వీటిలోనీళ్ల నాణ్యత ఇంకా ‘సీ కేటగిరీ’లోనే ఉన్నట్లు ఆఫీసర్లు నిర్ధారించారు. సెంట్రల్ పొల్యూ షన్ కంట్రోల్బోర్డు(సీపీసీబీ) రూల్స్ ప్రకారం.. ఓ నదిలోని నీళ్లలోఎలాంటి ఇన్ ఫెక్షన్ లేకపోతే ‘కేటగిరీ ఏ’గానూ,స్నానం చేయగలిగే నీళ్లయితే ‘కేటగిరీ బీ’, శుభ్రంచేసి తాగగలిగితే ‘కేటగిరీ సీ’గా, కేవలం అటవీజంతువులు తాగగలిగినవైతే ‘కేటగిరీ డీ’గా, పరిశ్రమల్లో వాడటానికి పనికొచ్చేవైతే ‘కేటగిరీ ఈ’గా గుర్తిస్తారు. ‘కేటగిరీ ఏ’ నీళ్లను శుభ్రం చేయాల్సిన పనిలేకుండా డైరెక్టుగా తాగేయొచ్చు.

కృష్ణ కంటే గోదారే నయం..

పోలవరం, కుమార దేవం, ధవళేశ్వరం, నల్లా చానెల్నుంచి గోదావరి నీళ్లను శాంపి ల్స్ గా తీసుకుని ఏపీ-పీసీబీ టెస్ టులు చేసింది. ఈ నీళ్ల పీహెచ్ విలువ 7.1నుంచి 7.5గా ఉండగా, ఆక్సిజన్ పాళ్లు 5.1 నుంచి8, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 1 నుంచి 2,కొలిఫాం కౌంట్ 75 నుంచి 210, టీడీఎస్ 124నుంచి 204గా ఉన్నట్లు తేలింది. సంగమేశ్వరం,శ్రీశైలం, వేదాద్రి, అమరావతి, ప్రకాశం బ్యారేజ్,హంసలదీవి వద్ద కృష్ణా నీళ్లను శాంపి ల్స్ గా తీసుకున్నా రు. వీటిలో గోదావరితో పోల్చితే కోలిఫాం బ్యాక్టీ రియా ఎక్కువగా ఉందని తేలింది. 100 ఎంఎల్ నీళ్లలో1600లకుపైగా కోలిఫాం బ్యాక్టీ రియా కౌంట్ ఉంది.